రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

59பார்த்தது
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హోంగార్డు మృతి చెందిన ఘటన సోమవారం కారేపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజారాం తెలిపిన వివరాల ప్రకారం. మాదారంకి చెందిన భూక్య చందర్ హోంగార్డుగా ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం మాదారం నుంచి ఖమ్మం వెళుతుండగా ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి జారిపడి గాయాలు కాగా, స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி