కారేపల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు అధికారులు యుద్ధ ప్రతిపాదికన సర్వే జరిపి రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి ప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల తహశీల్దార్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 25 వేలు, మరణించిన వారి కుటుంబానికి 25 లక్షలు, వరదలకు ధ్వంసమైన కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరారు.