కొత్తరేషన్కార్డులు, పింఛన్లు, ధరణి సమస్యలపై గురువారంఖమ్మం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు తేజా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విన్నవించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఆరు గ్యారెంటీలైన కొత్త రేషన్కార్డులు, పక్కాగృహాలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ. 12వేలు, ఇతర హామీలను అమలు చేయాలని డిమాడ్ చేశారు.