ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రచారం

84பார்த்தது
భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సింగరేణి (కారేపల్లి) గ్రామపంచాయతీలో ప్రచారం చేశారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయొద్దని పంచాయతీ కార్యదర్శి తిలక్ కిషోర్, పంచాయతీ వర్కర్ గౌతమ్ చెప్పారు. అత్యవసరం అయితే తప్ప బయటకి రావద్దని సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అన్నారు. అత్యవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி