సాకల వాగును పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా

76பார்த்தது
సాకల వాగును పరిశీలించిన ఎమ్మెల్యే మట్టా
తల్లాడ మండలం నారాయణపురంలో ఆదివారం ఎమ్మెల్యే మాట్టా రాగమయి పర్యటించారు. తల్లాడ-నారాయణపురం మధ్య ఉన్న సాకల వాగుకు భారీగా వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న సుమారు 20 ఇళ్లు జలమయమయ్యాయి. వెంటనే ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేసి జేసీబీ సహాయంతో వరద నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. అవసరమైతే ఇక్కడి ప్రజలకు పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

தொடர்புடைய செய்தி