నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు గణేష్ మండపాలను ఆదివారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు కమిటి నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆ విగ్నేశ్వరుడు నియోజకవర్గ ప్రజలందరికీ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు.