వేగంగా లోక్ అదాలత్ పరిష్కార ప్రక్రియ: జిల్లా జడ్జి

76பார்த்தது
వేగంగా లోక్ అదాలత్ పరిష్కార ప్రక్రియ: జిల్లా జడ్జి
ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ జరగనుండగా, ఇప్పటి నుంచే కేసుల పరిష్కార ప్రక్రియలో వేగం పెంచాలని జిల్లా జడ్జి జి. రాజగోపాల్ ఆదేశించారు. సత్తుపల్లి, మధిర న్యాయమూర్తులతో ఆయన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షించారు. గణేష్ నిమజ్జనోత్సవం ముగిసినందున పోలీసు అధికారుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులను పరిష్కరించాలని తెలిపారు. క్రిమినల్ కేసులే కాక సివిల్, కుటుంబ తగాదా కేసులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

தொடர்புடைய செய்தி