కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఉదయానికి 3, 800 క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 5 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం 21. 5 అడుగులుగా నమోదైంది. రిజర్వాయర్ అలుగులు, మినీ హైడల్ కాల్వ ద్వారా 4, 600 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. అయితే, భారీ వర్షాలు కురుస్తుండటంతో రిజర్వాయర్ కు వరద మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.