పాలేరుకు స్వల్పంగా పెరిగిన వరద

65பார்த்தது
పాలేరుకు స్వల్పంగా పెరిగిన వరద
కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ కు ఎగువ నుంచి వస్తున్న వరద ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఉదయానికి 3, 800 క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 5 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో రిజర్వాయర్ నీటిమట్టం 21. 5 అడుగులుగా నమోదైంది. రిజర్వాయర్ అలుగులు, మినీ హైడల్ కాల్వ ద్వారా 4, 600 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. అయితే, భారీ వర్షాలు కురుస్తుండటంతో రిజర్వాయర్ కు వరద మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி