ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా సోమవారం ఉదయం డ్రైనేజీ పూడికలను తీయించారు. అదేవిధంగా గ్రామాలలో బ్లీచింగ్ చల్లించి ప్రజలకు సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.