భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులకు సూచించారు. ముదిగొండ మండలం బాణాపురంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆదివారం అదనపు కలెక్టర్ సందర్శించి బాధితుల యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల తహశీల్దార్ సునీత ఎల్జిబెత్ కు అదనపు కలెక్టర్ పలు సూచనలు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని సూచించారు.