ఎగువ నుంచి వరద తగ్గడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 42.2 అడుగుల వద్ద వరద ప్రవహిస్తుండడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. శుక్రవారం రాత్రికి మరింతగా వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.