విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

64பார்த்தது
తరగతి గదుల్లో నిత్యం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని పాఠ్యాంశాలు చదివించాలని ఉపాధ్యాయులకు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కోనరావుపేట మండలం మర్తనపేట ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా తరగతి గదిలోకి వెళ్లి పాఠ్యాంశాలు బోధిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం ఆఫీస్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

தொடர்புடைய செய்தி