సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి

65பார்த்தது
సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలి
భద్రతతో విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ఏపీఏ ఏరియాలోని ఎంవిటిసిలో 48 రోజుల శిక్షణ పూర్తయిన డిపెండెంట్లకు జీఎం కార్యాలయంలో పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி