ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలి

61பார்த்தது
ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలి
ఉపరితల గనులలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలని జీఎం డివిఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. మంగళవారం ఆయన రామగుండం- 3 ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావుతోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించి, ఉపరితల గనులలో యంత్రాల వినియోగం, విడిభాగాలు, పరికరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి రాధాకృష్ణ, ఏరియా సేఫ్టీ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி