పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఆర్జీ- 3 జీఎం

83பார்த்தது
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఆర్జీ- 3 జీఎం
ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవాలని రామగుండం- 3 ఏరియా జనరల్ మేనేజర్ సుధాకరరావు అన్నారు. సోమవారం ఆర్జీ- 3, ఏపీఏ ఏరియాలోని సెంటినరీ కాలనీలోని సింగరేణి పార్కులో నిర్వహించిన స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 4. 0 కార్యక్రమంలో భాగంగా జీఎం మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రఘుపతి, శ్రీనివాసులు, రాజారెడ్డి, గుర్తింపు సంఘం నాయకులు రామచంద్రరెడ్డి, కోట రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி