గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి సీపీ పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అడ్మిన్ డీసీపీ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏసిపి ఎం. రమేష్ పాల్గొన్నారు.