ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి: వై. సత్తయ్య

54பார்த்தது
ఆర్జీ1 2వ గనిలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని యాజమాన్యాన్ని కోరారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని సత్తయ్య డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி