విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి: మంత్రి శ్రీధర్ బాబు

58பார்த்தது
విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి: మంత్రి శ్రీధర్ బాబు
విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మంథని నియోజకవర్గం కాటారం మండలం గంగారం మోడల్ స్కూల్ ను మంత్రి సందర్శించారు. ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పాఠశాలకు సంబంధించిన మౌలిక వసతులపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி