కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం

51பார்த்தது
కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. మంగళవారం మండలంలోని అంకంపల్లి, మడిపల్లి, ఆశన్నపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி