గాలివాన బీభత్స బాధితులను ఆదుకోవాలని ఎమ్యెల్యేకు వినతి

57பார்த்தது
గాలివాన బీభత్స బాధితులను ఆదుకోవాలని ఎమ్యెల్యేకు వినతి
తాడ్వాయి మండలం కరడ్ పల్లిలో ఈ నెల 8న భారీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ భీభత్సంలో నష్టపోయిన బాధితులు చాకలి పూరింటి రాజయ్య, దెబ్బటీ సంజీవులు, గొల్ల మల్లయ్య గ్రామ కాంగ్రెస్ నాయకుడు రాజప్పతో కలిసి సోమవారం ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు కు కలిసి వినతి పత్రం అందించారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ నేత మాట్లాడుతూ. గాలివానకు పశువుల షెడ్లు కూలిపోయి ఆవులు గాయపడ్డాయన్నారు. దాదాపు 4లక్షల నష్టం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி