కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మండ్రు సిరి పటేల్ పదో తరగతిలో 10 జిపిఏ సాధించి తన ప్రతిభను చాటింది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన మండ్రు లావణ్య, శ్రీనివాస్ ల ప్రథమ బిడ్డ సిరి పటేల్ ఆర్మూర్ కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో (కేజీబీవీ) చదువుతున్నారు. డాక్టర్ కావాలన్నది తన లక్ష్యమని సిరి పటేల్ అన్నారు. పది జిపిఏ సాధించిన సిరి పటేల్ ను ఆర్మూర్ కేజీబీవీ ఉపాధ్యాయులతో పాటు పలువురు అభినందించారు.