దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి

55பார்த்தது
దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకోవాలి
దివ్యాంగులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపకుడు చిప్ప దుర్గాప్రసాద్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ దివ్యాంగుల కోసం ఉచిత రవాణా సౌకర్యం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో పంగ ఈశ్వర్, గాడి నర్సింలు, బంటు స్వామి, బంజ రాజు తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி