వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు

71பார்த்தது
వరద బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు
భారీ వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అయింది. వరదలతో చాలా మంది తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో 7 వేల ఇళ్లు కూలిపోయాయని కలెక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎక్కువగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోనే ఇళ్లు కూలిపోయాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు, స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.