రెప్పపాటులో 28 కిలోల ఆభరణాలు ఉన్న బ్యాగును లాక్కొని పారిపోయారు (వీడియో)

566பார்த்தது
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ వ్యక్తి బైక్ తీస్తుండగా అతడి వద్ద ఉన్న బ్యాగును లాక్కొని దొంగలు పరారయ్యారు. ఆ బ్యాగులో 28 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్టు బాధితులు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.23.5 లక్షలు ఉంటుంది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మహిళ లాగా ముఖానికి స్కార్ఫ్ కట్టుకున్న వ్యక్తి బ్యాగు లాక్కొని వెళ్లి అక్కడ సిద్ధంగా ఉన్న బైక్‌ ఎక్కి అక్కడి నుంచి ఉడాయించాడు.

தொடர்புடைய செய்தி