రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య

66பார்த்தது
రైలు కిందపడి ఒకరి ఆత్మహత్య
రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్లోని 1వ నంబర్ ప్లాట్ఫారం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి(50) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడు చామనఛాయ రంగు, గుండ్రని ముఖం, క్రీం రంగు చొక్క ధరించి ఉన్నట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி