సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 3.8 కిలోల గంజాయిని తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన లంబోదర్ జెనా (43) పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఒరిస్సా నుంచి సికింద్రాబాద్ కోణార్క్ ఎక్స్ప్రెస్లో తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ రూ. 96 వేలు ఉంటుందని జీఆర్పీ డీఎస్పీ ఎస్.ఎన్. జావేద్ తెలిపారు.