రాఖీ అవెన్యూస్ ఇష్యూస్ పై ఎండీ రామయ్య వేణు వివరణ

73பார்த்தது
చంద్రిక,అవంతిక అనే ప్రాజెక్టుల గురించి వస్తున్న కథనాలు వాస్తవాలు కావని రాఖీ అవెన్యూస్ లిమిటెడ్ ఎండీ రామయ్య వేణు అన్నారు. నేడు మీడియాతో ఆయన మాట్లాడారు.. రాఖీ అవెన్యూస్ కు సొంతంగా భూమి ఉందని అది తమదేనని ఇప్పటికే 15 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. కస్టమర్లకు ఇచ్చిన హామీల ప్రకారం పూర్తి చేసి ఇచ్చే బాధ్యత తమదేనని,వేరే ఎవరికి సంబంధం లేదని రామయ్య వేణు స్పష్టం చేశారు.. 31 ఏళ్ల నుండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నట్లు గుర్తు చేశారు. 10-15 రోజుల్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. 2016-17లో బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సుమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కస్టమర్లకు ఇచ్చిన హామీల ప్రకారం కట్టించే బాధ్యత రాఖీ అవెన్యూస్ లిమిటెడ్ వారిదే అని అన్నారు.పలు మీడియా సంస్థలో వస్తున్న కథనాలను ఎవరు నమ్మకూడదని, ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி