సైదాబాద్ మాత మైదానంలోని శ్రీ విజయ దుర్గ మాత శుక్రవారం శాకాంబరీ అలంకరణలో దర్శనమిచ్చారు. ఈనెల 28 నుంచి అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్న సందర్భంగా అమ్మవారిని అలంకరించి దర్శనాన్ని కల్పించారు. ఉదయం మాతకు విశేష అభిషేకల అనంతరం దాదాపు 25రకాల కూరగాయలు. ఆకుకూరలతో అలంకరం చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునెందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.