హైదరాబాద్ అంబర్పేట్లోని ప్రేమ్ నగర్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన ఎగ్జామ్లో కాపీ కొడుతున్నారని టీచర్ దండించడంతో నలుగురు ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. నలుగురు విద్యార్థులు సికింద్రాబాద్ పోలీస్స్టేషన్ నుంచి వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యింది.