ఆరు కరెంటు ఖాతాలు తెరిచేందుకు సైబర్ నేరస్థులకు సహకరించిన హైదరాబాద్ శంశీర్ గంజ్ ఎస్బీఐ శాఖ పూర్వ మేనేజర్ మధుబాబును, మరో వ్యక్తిని టీజీసీఎస్సీ పోలీసులు అరెస్టు చేశారు. నేరగాళ్లు దాదాపు 600 మంది బాధితుల నుంచి కాజేసిన రూ.175 కోట్ల సొమ్ము, పేదల పేరుతో తెరిచిన ఈ ఖాతాల్లోకి చేరిందని అధికారులు గుర్తించారు. కమీషన్ కోసం మధుబాబు ఆ ఖాతాల ద్వారా డబ్బు బదిలీ, విత్ డ్రా కు సహకరించాడని పోలీసులు తెలిపారు.