ఉప్పల్‌ స్టేడియం వద్ద హైటెన్షన్‌

85பார்த்தது
ఉప్పల్‌ స్టేడియం వద్ద హైటెన్షన్‌
హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియం వద్ద హైటెన్షన్‌ నెలకొంది. నేడు జరుగనున్న భారత్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరించిన నేపథ్యంలో స్టేడియం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బాంబ్, డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 2,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

தொடர்புடைய செய்தி