కాటు వేసిన ప్రమాదకరమైన పామును పట్టుకొని ఆస్పత్రికి వెళ్ళాడు(వీడియో)

69பார்த்தது
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బరారి పంచాయతీ మీరాచక్ నివాసి ప్రకాష్ మండల్ అనే వ్యక్తి మంగళవారం ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన రస్సెల్స్ వైపర్ కాటుకు గురయ్యాడు. అయితే ఆ వ్యక్తి కాటు వేసిన పామును గట్టిగా పట్టుకొని వైద్యం కొసం ఆస్పత్రికి వెళ్లాడు. అది చూసి ఆస్పత్రి సిబ్బంది, జనం భయాందోళనకు గురయ్యారు. అయితే అతి కష్టం మీద పామును ఒక సంచిలో వేసి కట్టేశారు. అనంతరం ఆ వ్యక్తికి చికిత్స అందించారు.

தொடர்புடைய செய்தி