TG: ట్రాఫిక్ తనిఖీలను తప్పించుకునే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. HYDలోని ఐడీపీఎల్ కాలనీ గేటు వద్ద ఆదివారం ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేపట్టారు. షాపూర్నగర్ రొడామేస్త్రీనగర్కు చెందిన జోషిబాబు(35) బైక్ను కానిస్టేబుల్ ఆపగా.. నిలిపినట్లు చేసి కుడివైపు వేగంగా పోనిచ్చాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో చక్రాల కింద పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ వల్లే చనిపోయాడని అతడి బంధువులు ఆందోళనకు దిగారు.