ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్ వీధుల్లో కంటెంట్ క్రియేటర్ ప్రణయ్ జోషి ఇటీవల ప్రవర్తించిన తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన శరీరంపై షర్టు లేకుండా, కేవలం షార్ట్ మాత్రమే ధరించి తిరిగాడు. రద్దీగా ఉండే మార్కెట్లో అతడిని చూసి చాలా మంది అసౌకర్యానికి గురయ్యారు. షాపింగ్ కోసం కొన్ని షాపుల్లోకి వెళ్లేందుకు యత్నించాడు. అయితే వారు అతడికి ప్రవేశాన్ని నిరాకరించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.