పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

81பார்த்தது
పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే
మక్తల్ తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముభారక్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 163 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రజలు కల్యాణలక్ష్మి డబ్బులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி