కొత్తకోట మండలంలో విస్తృతంగా పర్యటించిన దేవరకద్ర ఎమ్మెల్యే

54பார்த்தது
కొత్తకోట మండలంలో విస్తృతంగా పర్యటించిన దేవరకద్ర ఎమ్మెల్యే
కొత్తకోట మండలం పామపూరంలో శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన దుర్గమ్మను గురువారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం వీరరాఘవపురం-పామాపురం వెళ్లే రహదారిని పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, గ్రామ చెరువు నుండి పంట పొలాలకు వెళ్లే కాలువలకు స్టిల్ట్ తీయించాలని గ్రామ సెక్రెటరీని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி