ఐదేళ్ల బాలుడిని గొంతు నులిమి చంపేశాడు (వీడియో)

14548பார்த்தது
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా లో తాజాగా ఓ దారుణం జరిగింది. అక్కడ ఓ గ్రామంలో అక్షిత్ (5)అనే బాలుడిని.. పొరుగింటి వ్యక్తి సురేష్‌ (45) కిడ్నాప్ చేశాడు. అనంతరం అక్షిత్ ని గొంతు నులిమి చంపేశాడు. కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సురేష్ ఇంటివెనుక గడ్డివాములో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி