మద్యం మత్తులో గాజు సీసాతో ఓ వ్యక్తిని గొంతు కోసి చంపేశారు (వీడియో)

68பார்த்தது
ఏపీలోని శ్రీశైలంలో శనివారం అర్థరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. క్షేత్రంలోని పాతాళగంగ పాత మెట్ల మార్గంలో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గాజు సీసాతో అశోక్‌ అనే వ్యక్తిని గొంతు కోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్‌ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி