ఇళ్ల మధ్యకు వచ్చిన మొసలి (వీడియో)

60பார்த்தது
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌‌లో ఒక మొసలి నివాసాల మధ్యకు వచ్చింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాన్పూర్‌‌ నగరంలోని ఒక హౌసింగ్ సొసైటీ దగ్గర ఈ మొసలి ప్రత్యక్షమైంది. చిన్నారుల బృందం క్రికెట్ ఆడుతుండగా కాలువలోంచి మొసలి బయటకు రావడాన్ని గమనించి ప్రజలకు సమాచారం అందించారు. వారు అధికారులకు సమాచారమివ్వగా వెంటనే అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి మొసలిని బంధించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி