హర్యానా అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా ఎన్నికలకు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆ పార్టీ సీనియర్ నేతలు అజరు మాకేన్, ప్రతాప్సింగ్ బజ్వాలను ఎఐసిసి సీనియర్ పరిశీలకులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ శనివారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి.