తెలుగు రాష్ట్రాల్లో సోమవారం చలి పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏపీలో గాలి కదలికలు అధికంగా ఉన్న కారణంగా రాత్రి వేళల్లో చలి పెరుగుతుందని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణలోనూ చలి పెరగనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్లో ఇవాళ కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా.. ఆకాశంలో మేఘాలు ఉంటాయని పేర్కొన్నారు.