దుబాయ్ వేదికగా మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్-భారత్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్లో ఆడబోయే భారత జట్టులో ఓ కీలక మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. దీంతో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను ఫైనల్ మ్యాచ్కు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.