బస్సు బోల్తా.. నలుగురు స్పాట్ డెడ్ (వీడియో)

53பார்த்தது
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలోని 16వ నంబర్ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుంచి భక్తులతో పూరీకి వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி