ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ నేతలకు భయం పట్టుకుందని, అందుకే అర్థంలేని వ్యాఖ్యలు చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను దేవుడు పంపిన దూతగా చెప్పుకోవడంపై కూడా బెంగాల్ సీఎం మండిపడ్డారు. శుక్రవారం సుందర్బన్ ప్రాంతంలోని మథురాపూర్లో ఏర్పాటుచేసిన ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్న మమత.. కాషాయ పార్టీపై నిప్పులు చెరిగారు.