దక్షిణాసియాలో ఎక్కడ భూకంపం వచ్చినా దాని ప్రభావం భారతదేశం పై పడుతోంది. నేపాల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.0 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం ఉత్తర భారత్నూ తాకినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిసింది. ఉత్తరాఖండ్, ఉత్తర్ప్రదేశ్లలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వారు ఒక ప్రకటనలో వెల్లడించారు.