బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 2 వారాల నుంచి వరుసగా బ్రిడ్జ్లు, కాజ్వేలు కూలిపోతున్నాయి. తాజాగా ఇవాళ కూడా మరో బ్రిడ్జ్ కూలిపోయింది. సరన్ జిల్లాలో గండకి నదిపై ఉన్న వంతెన ఈరోజు ఉదయం కూలిపోయినట్లు జిల్లా మెజిస్ట్రేట్ అమన్ సమీర్ తెలిపారు. ఇది 15 ఏళ్ల నాటి వంతెన అని చెప్పారు. కాగా, గత 15 రోజుల్లో బీహార్లో 10 వంతెనలు కూలడం గమనార్హం.