కాగజ్నగర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న రమాదేవిని సస్పెండ్ చేసినట్లు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుఖ్ దేవ్ బోబాడే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రమాదేవిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అటవిశాఖ అధికారులు ఎవరైనా తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.