రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

4451பார்த்தது
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మందమర్రి- మంచిర్యాల రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు ఉండగా, తెలుపు రంగు తల వెంట్రుకలు, క్రీమ్ రంగు షర్టు, వంకాయ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రైల్వే ఎస్సై సుధాకర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி