పార్లమెంట్ అభ్యర్థిగా తొలిసారి ఆదివాసీ మహిళకు అవకాశం

1074பார்த்தது
ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తొలిసారి ఆదివాసీ మహిళకు అవకాశం లభించడం హర్షనీయమని, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలనీ తలమడుగు జెడ్పిటిసి గోక గణేష్ రెడ్డి సూచించారు. మండలంలోని కోసాయి గ్రామంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులను కలిసి చేతు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி