ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి

61பார்த்தது
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బోథ్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కోరారు. ప్రజలు వాగులు, చెరువుల వద్దకు వెళ్ళవద్దని, లోతట్టు ప్రాంత వాసులు అత్యవసర సమయంలో వెంటనే అధికారులను సంప్రదించాలని కోరారు. అలాగే పొలాలకు వెళ్లే వారు తడిసిన విద్యుత్ స్తంభాలను తాకవద్దని, చెట్ల కింద ఉండొద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி